గూగుల్ న్యూస్‌లో మాతో చేరండిSamayam Telugu

2 కోట్ల డైమండ్‌ హెయిర్‌ క్లిప్‌, 280 కోట్ల నగలు, ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసిన హైదరాబాద్‌ ధనవంతురాలు!

Authored byకిషోర్‌ రెడ్డి|Samayam Telugu
Subscribe

ఫ్యాషన్‌ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పారిస్‌ హాటో కోచర్‌ వీక్‌లో ఈసారి ప్రపంచ దేశాల టాప్‌ డిజైనర్ల దుస్తుల ప్రదర్శనను పక్కకు నెట్టి హైదరాబాద్‌ బిలీనియర్‌ సుధా రెడ్డి ధరించిన ఆభరణాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో ఆమె లుక్స్‌ అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా ఆమె ధరించిన ఆభరణాల విలువ సుమారు రూ.280 కోట్లు ఉంటుందని అంచనా. మెట్‌ గాలా 2026 తర్వాత పారిస్‌ ఫ్యాషన్‌ వేదికపై కూడా సుధా రెడ్డి తన రాయల్‌ లుక్‌తో మరోసారి అంతర్జాతీయ స్థాయిలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచారు.

Sudha Reddy Jewellery Collection
Images Credit : Sudha Reddy Instagram(ఫోటోలు- Samayam Telugu)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైనర్లు తాము ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రాలంకరణలను ప్రదర్శించే పారిస్‌ హాట్‌ కోచర్‌ వీక్‌ (Paris Haute Couture Week) ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ వేడుక అంతా డిజైనర్లు వారి స్పెషల్‌ ఫ్యాషన్‌ కలెక్షన్స్‌ చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈసారి మాత్రం హైదరాబాద్‌కి చెందిన బిలీనియర్‌ సుధా రెడ్డి ధరించిన ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రెండు రోజుల పాటు ఆమె లుక్స్‌ విశేషంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రధానంగా రత్నాలు పొదిగిన ఆమె ఆభరణాలే ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సెలబ్రిటీ జ్యువెల్లరీ నిపుణుడైన ప్రియాన్షు గోయల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సుధారెడ్డి ధరించిన ఈ నగలు ఆమె పర్సనల్ కలెక్షన్‌లోనివని, వీటి విలువ సుమారు రూ.280 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.


జార్జియో అర్మానీ షోలో..

సుధా రెడ్డి జార్జియో అర్మానీ షో కోసం ఆ బ్రాండ్‌ కలెక్షన్‌ నుంచి నీలిరంగు స్కల్ట్పెడ్‌ దుస్తుల్లో విచ్చేశారు. ఎలాంటి ఆడంబరం లేని హుందాతనం, మెరిసే ఆకృతితో ఉన్న ఈ దుస్తులు ఎలాంటి ఆర్భాటం లేని విలాసవంతమైన శైలిని సరికొత్తగా ఆవిష్కరించాయి.

ఆమె ఈ డ్రస్‌కి తగ్గట్లుగానే 30 క్యారెట్ల వజ్రాలు పొదిగిన పాంథర్‌ ఇయర్‌ కఫ్స్‌ ధరించారు. అంతే కాకుండా ఆమె పెట్టుకున్న 23 క్యారెట్ల పసుపు రంగు వజ్రపు ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ఆమె మరో చేతికి 30 క్యారెట్ల రోజ్‌ కట్‌ వజ్రపు ఉంగరాన్ని ధరించారు. ఆమె లుక్స్‌లో ఇవి మెయిన్‌ హైలైట్‌.

ఎలీ సాబ్‌ రన్‌వే షోలో..

సుధా రెడ్డి ఎలీ సాబ్‌ రన్‌వే షోలో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుక కోసం ఆమె దుపట్టాతో కూడిన స్ట్రాప్‌లెస్‌ ఫ్లోరల్‌ గౌన్‌ ధరించారు. సింపుల్‌ స్టైల్‌, సున్నితమైన ఫ్లవర్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించిన ఈ స్పెషల్ డిజైనర్‌ వేర్‌కు తగినట్లుగా ఆమె తన కలెక్షన్‌లోని సంప్రదాయ ఆభరణాలను ధరించి మెరిసిపోయారు.

ఎలీ సాబ్‌ రూపొందించిన టర్కోయిస్‌ ఇయర్‌ కఫ్స్‌, ఆమె ధరించిన అద్భుతమైన దుస్తుల అందాన్ని ఏమాత్రం తగ్గించకుండా అందరి దృష్టిని వెంటనే ఆకర్షించాయి. ఈ ఇయర్‌ కఫ్స్‌లో పొదిగిన టర్కోయిస్‌ డైమండ్‌, గతంలో సల్మాన్‌ ఖాన్‌ తన బ్రాస్‌లెట్‌లో ధరించిన డైమండ్‌ వంటిదేనని సెలబ్రిటీ జ్యువెల్లరీ నిపుణుడు ప్రియాన్షు గోయల్‌ పేర్కొన్నారు.

మనీష్‌ మల్హోత్రా పారిస్‌ షోలో..

పారిస్‌ కోచర్‌ వీక్‌లో మనీష్‌ మల్హోత్రా తొలిసారిగా నిర్వహించిన షోలో సుధారెడ్డి, చేతి ఎంబ్రాయిడరీ వర్క్‌గల కార్సెట్‌ సిల్హౌట్‌ దుస్తులను ఎంచుకున్నారు. ఈ దుస్తుల యొక్క స్పెషల్‌ డిజైన్‌, స్టైల్‌ అద్భుతమైన టైలరింగ్‌ స్కిల్‌ని మరింత హైలైట్‌ చేశాయి.

ఈ దుస్తులపై చేత్తో ఎంబ్రాయిడరీ చేసిన త్రీ డైమెన్షనల్ ఫ్లవర్‌ డిజైన్లు ఉన్నాయి. దీనికి తోడు మనీష్‌ మల్హోత్రా కలెక్షన్‌ నుంచి స్పెషల్‌గా రూపొందించిన డైమండ్‌ బో నెక్లెస్‌ను ఆమె ధరించారు. పర్షియన్‌ డిజైన్‌ స్ఫూర్తితో రూపొందించిన ఫ్లవర్‌ ఆకృతి గత హెయిర్‌ యాక్సెసరీ ఆమె లుక్‌ను మరింత అందంగా మార్చింది. ఈ నెక్లెస్‌లో అత్యుత్తమ నాణ్యత కలిగిన 75 క్యారెట్ల సహజ వజ్రాలను పొదిగారని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆమె పెట్టుకున్న డైమండ్‌ హెయిర్‌ క్లిప్‌ విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు.

ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్‌ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్‌నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్‌, రిలేషన్‌షిప్‌ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్‌ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్‌లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్‌లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్‌ / జాబ్స్‌ సెక్షన్‌ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్‌ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

సంభాషణను ప్రారంభించండి
telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.