గూగుల్ న్యూస్‌లో మాతో చేరండిSamayam Telugu

జలుబు + దగ్గు + గొంతు నొప్పి తగ్గించే మిరియాలు చిట్కా, ఎలా వాడాలంటే?

Authored byకిషోర్‌ రెడ్డి|Samayam Telugu
Subscribe

వర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల మందులు, ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం. అయితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నివారణకు ఇంటి చిట్కాలు ఎఫెక్టివ్‌గా సహాయపడతాయని మన పూర్వకాలం నుంచి తెలిసిందే. ముఖ్యంగా మిరియాలు జలుబు, దగ్గు సమస్యకు అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఈ సమస్యలను తగ్గించడానికి మిరియాలు ఎలా సహాయపడతాయో ఈ స్టోరీలో చూద్దాం.

Cold Cough Home Remedy
Images Credit : iStock(ఫోటోలు- Samayam Telugu)
వర్షాకాలం మొదలైతే చల్లటి వాతావరణం, తేమ పెరగడం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాపించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. జలుబు, గొంతునొప్పి, చికాకును తగ్గించడానికి ఇంటి చిట్కాలు ఎఫెక్టివ్‌గా సహాయపడతాయి. అలాంటి వాటిలో వంటింట్లో తప్పనిసరిగా ఉండే మిరియాలు ఒకటని BMJSTR అధ్యయనం పేర్కొంది. మసాలా దినుసుగా మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలో కూడా మిరియాలకు ప్రత్యేక స్థానం ఉంది.

ఇందులో ఉండే పైపరిన్ అనే సహజ సమ్మేళనానికి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు ఉంటాయి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి. వర్షాకాలంలో జలుబు, గొంతు నొప్పిని తగ్గించడానికి మిరియాలు ఎంత ఎఫెక్టివ్‌గా సహాయపడతాయో ఈ స్టోరీలో చూద్దాం..


గొంతునొప్పి నుంచి ఉపశమనం

జలుబు వచ్చినప్పుడు గొంతులో మంట, నొప్పి, గరుకుదనం వంటి సమస్యలు సాధారణం. గోరువెచ్చని నీటిలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకున్నా, తేనెతో కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకున్నా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు గొంతు చికాకును దూరం చేస్తాయి. గొంతులోని కఫాన్ని పలుచన చేసి రిలీఫ్‌ ఇస్తాయి.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

నల్ల మిరియాలలో పైపరిన్‌ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌. అంతే కాకుండా.. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇవి గొంతు నొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ సమస్యను పరిష్కరిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించే గుణాలు ఉంటాయి. దీంతో కఫం బయటకు రావడం సులభమై, ఛాతీలో బరువుగా అనిపించే భావన కొంత తగ్గుతుంది. ఉపశమనం కోసం మిరియాల పొడిని తేనె లేదా అల్లం టీతో కలిపి తీసుకోండి.

ఇమ్యూనిటీ పెంచుతుంది

మిరియాలలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్‌, కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పైపరైన్‌ అనే సమ్మేళం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మిరియాలను తరచు తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇన్ఫెక్షన్లు, రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. మిరియాలలో ఉండే యాంటీమైక్రోబియల్‌ గుణాలు, తేమతో కూడిన వర్షాకాలంలో వృద్ధి చెందే హానికరమైన బ్యాక్టీరియా, క్రిముల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది.

ఎలా తీసుకోవాలంటే

  • తేనెలో చిటికెడు మిరియాలు పొడి కలిపి తీసుకోవచ్చు.
  • మిరియాలు, అల్లం, తులసి ఆకులు వేసి కషాయం చేసుకుని తీసుకోవచ్చు.
  • పాలలో చిటికెడు మిరియాల పొడి కలుపుకుని తాగొచ్చు.
  • మిరియాల రసం చేసుకుని తాగొచ్చు.

మిరియాలు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

మిరియాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో కడుపులో మంట, అసౌకర్యం కలగవచ్చు. చిన్నపిల్లలు, గర్భిణులు, అల్సర్, జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అలాగే జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూడు రోజులకంటే ఎక్కువ దగ్గు వంటి లక్షణాలు ఉంటే ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా డాక్టర్‌ను సంప్రదించండి.

ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్‌ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్‌నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్‌, రిలేషన్‌షిప్‌ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్‌ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్‌లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్‌లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్‌ / జాబ్స్‌ సెక్షన్‌ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్‌ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

సంభాషణను ప్రారంభించండి
telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.